ఆసియా కప్ 2023: స్టేడియంలో కొట్టుకున్న ఇండియా-శ్రీలంక ఫ్యాన్స్

ఆసియా కప్ 2023: స్టేడియంలో కొట్టుకున్న ఇండియా-శ్రీలంక ఫ్యాన్స్

సహజంగా ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం ఉంటుంది. కానీ చాలా అరుదుగా మాత్రమే కొట్లాటకు వెళ్తారు. ఆసియా కప్ సూపర్-4 లో భాగంగా ఈ చెత్త సంఘటన చోటు చేసుకుంది. భారత్-శ్రీలంక మధ్య జరిగిన ఈ మ్యాచులో ఫ్యాన్స్ ఫైటింగ్ చేసుకుంటూ కనిపించారు.

మ్యాచ్ తర్వాత రెచ్చిపోయిన ఫ్యాన్స్ 

ఆసియా కప్ లో శ్రీలంకపై భారత్ 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ గెలిచేశామని సంతోషించేలోపు అభిమానుల మధ్య ఫైటింగ్ ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.దీని ప్రకారం మ్యాచ్ ముగిసిన తరువాత, స్టేడియం పై స్టాండ్‌లో భారత్, శ్రీలంక అభిమానులు క్రూరమైన ఘర్షణకు పాల్పడ్డారు. ఒకరినొకరు పిడి గుద్దులతో దాడి చేసుకున్నారు. అక్కడే మహిళా పోలీస్ ఉన్నా చూస్తూ అలా ఉన్నా.. ఏమీ చేయలేకపోయారు. అయితే ఈ గొడవకి  కారణమేంటో తెలియలేదు. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియో మీరూ చూసేయండి.