కరీనా కపూర్ మళ్లీ తల్లి అవుతుందా.. 42 ఏళ్ల వయస్సులో ఖండించలేదు ఎందుకు..?

కరీనా కపూర్ మళ్లీ తల్లి అవుతుందా.. 42 ఏళ్ల వయస్సులో ఖండించలేదు ఎందుకు..?

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్( Kareena Kapoor),సైఫ్ అలీ ఖాన్‌(Saif Ali Khan)ను మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే.వీరిద్దరికీ  తైమూర్ అలీ ఖాన్, జెహ్ అలీ ఖాన్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా లేటెస్ట్గా కరీనా మూడోసారి ప్రెగ్నెన్సీ అయ్యిందనే న్యూస్..సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

లేటెస్ట్గా కరీనా ఈవెంట్లో పాల్గొన్న ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్లో, కరీనా బేబీ బంప్లో కనబడటంతో నెటిజన్స్ ఫొటోస్ ను వైరల్ చేస్తున్నారు. రీసెంట్గా( ఆగస్టు 31, 2023)న రిలయన్స్ ముకేశ్ అంబానీ డాటర్ ఇషా అంబానీ గ్లిట్జీ లాంచ్ ఈవెంట్‌కు కరీనా అటెండ్ కాగా..కారులోంచి స్టేజీ దగ్గరికి వచ్చేటప్పుడు బేబీ బంప్ చూసిన ఫ్యాన్స్కు..ప్రెగ్నెన్సీ అనే విషయం కన్ఫర్మ్ అయ్యింది.

కరీనా కపూర్ తన థర్డ్ ప్రెగ్నెన్సీ డిటైల్స్ ఆఫిసియల్గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ..సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ఎక్కడ ఖండించలేదు. దీంతో కరీనా కపూర్ మళ్లీ తల్లి అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 42 ఏళ్ల వయస్సులో మళ్ళీ తల్లి కావడం పట్ల భిన్నమైన కామెంట్స్ వస్తున్నప్పటికీ, ఎక్కడ కూడా కరీనా రియాక్ట్ కాకపోవడం ఫ్యాన్స్ కు ఆశర్యం కలిగిస్తోంది. అలాగే కరీనా తన ఇన్‌స్టాగ్రామ్ లో బేబీ బంప్ తో ఉన్న ఫొటోస్ షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక త్వరలో తన థర్డ్ ప్రెగ్నెన్సీ విషయంపై ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కరీనా తన రూమర్లను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. 

గతంలో భర్త సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి లండన్ పర్యటనలో ఉన్నప్పుడు కూడా ఇలాంటీ పుకార్లు వచ్చాయి.అప్పుడు కాస్తా ఉబ్బిన పొట్ట అని పుకార్లను తోసిపుచ్చింది.ఇక లేటెస్ట్ ఫొటోస్ తో ఎలా రియాక్ట్ అవుతుందో అని నెటిజన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ కు కరీనా కపూర్, కియారా అద్వానీ, సుహానా ఖాన్, అర్జున్ కపూర్ అటెండ్ అయ్యారు.