నాకు న్యాయం చేయండి..లేకపోతే ఆత్మహత్యే శరణ్యం

నాకు న్యాయం చేయండి..లేకపోతే ఆత్మహత్యే శరణ్యం

తన భూమిని, తనకు రావాల్సిన నష్టపరిహారాన్ని కాజేశారని.. తనకు న్యాయం చేయాలని కలెక్టర్, ఆర్డీవో, ఏసీపి కాళ్లు మొక్కాడు ఓ రైతు. ఇటీవల ప్రగతి భవన్ ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఐలయ్య.. ఇవాళ.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కలెక్టర్ కాళ్లు మొక్కాడు. కొత్త ఆర్డీఓ కార్యాలయం నిర్మాణం కోసం శంఖుస్థాపన చేసేందుకు కలెక్టర్ అమోయ్ కుమార్, ఇబ్రహీంపట్నం  ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆర్డీవో వెంకటాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందించాడు. తన భూమిని, నష్టపరిహారాన్ని ఓ రిటైర్డ్ వీఆర్వో సహకారంతో ఇతరుల పేర్లు చేర్చి కాజేశారని తెలిపారు. తనకు న్యాయం చేయాలని.. లేకపోతే తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని వేడుకున్నారు రైతు ఐలయ్య.

మరిన్ని వార్తల కోసం

జిమ్నాస్టిక్ ప్లేయర్ అరుణారెడ్డికి కారు గిఫ్ట్

కేసులు పెరిగితే స్కూళ్ల మూసివేతపై నిర్ణయం!

యాదాద్రిలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ల ఓవరాక్షన్