కైరోలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించి హైదరాబాద్ కు తిరిగి వచ్చిన అరుణ రెడ్డి కి బ్యాడ్మింటన్ కోచ్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరి నాథ్ కియా కారును అందజేశారు. ఇవాళ( బుధవారం) సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తన నివాసంలో కారు తాళాలను అందజేశారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తి, ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన అరుణా రెడ్డి ని మరింత ప్రోత్సహించేందుకే ఈ కారు ని బహుమతిగా అందజేసినట్లు తెలిపారు చాముండేశ్వరి నాథ్. భవిష్యత్ లో మరిన్ని పతకాలు సాధిచడం లో తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.
జిమ్నాస్టిక్ విభాగంలో రెండు స్వర్ణ పథకాలను అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు అరుణారెడ్డి. మరింత ప్రోత్సాహం లభిస్తే రానున్న కామన్వెల్త్ క్రీడల్లో మువ్వన్నెల పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపుతానని తెలిపారు.
మరిన్ని వార్తల కోసం..