రాష్ట్రవ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు

రాష్ట్రవ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు

మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం రైతురుణమాఫీ ప్రకటించడం వలన రైతులు హర్షం వ్యక్తం చేశారు.  రాజకీయాలకు అతీతంగా సన్న, చిన్నకారు రైతులందరికి రుణమాఫీ చేసినందుకు డోర్నకల్ నియోజకవర్గంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ .. సీఎం రేవంత్ రెడ్డి .. రామచంద్రనాయక్  చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు .  రైతు రాజ్యం అంటే ఇలా ఉంటుందని కొనియాడారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా  కోనరావుపేట మండలం నిజామాబాద్ లో  రైతు రుణ మాఫీ సంబరాల్లో  ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్..  పాల్గొని డోలు వాయించారు. సంగారెడ్డి  జిల్లా   ఆందోలు మండలంలోని డాకూర్ గ్రామంలో రైతు రుణమాఫీ కార్యక్రమంలో  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో   కలెక్టర్ వల్లూరు క్రాంతి , రైతు సంఘ నాయకులు, రైతులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక రైతు వేదికలో జరిగిన రుణమాఫీ   రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరయ్యారు.  

రుణమాఫీ చేస్తున్న సందర్భంగా సదాశివ పల్లి నుంచి మానకొండూరు రైతు వేదిక వరకు రైతులతో కలిసి  ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బైక్ ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్  మండలం గుండారం, రైతు వేదికలో రైతు రుణ మాఫీ సందర్భంగా  సీఎం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, డాక్టర్, భూపతి రెడ్డి. పాల్గొన్నారు. ఇక ఎల్లారెడ్డి నియోజిక వర్గం మిసంపల్లి గ్రామములో జరిగిన రుణమాఫీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు.