
హైదరాబాద్సిటీ, వెలుగు: ‘రైతును బ్రతికించాలి. కాపాడాలి.. అండగా ఉండాలి’ అనే నినాదంతో యూత్ ఫర్ యాంటీ కరప్షన్సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో అన్నదాతకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. దీనికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, మాజీ అగ్రికల్చర్ ఆఫీసర్ అశోక్ కుమార్ ముఖ్య అతిథి గాహాజరయ్యారు.
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రైతులంతా సంఘటితమై రాజకీయాలు మార్చాలన్నారు. నిజాయితీ రాజకీయాలకు రైతులే పునాది వేయాలన్నారు. ఇండిపెండెన్స్డే రోజు రైతులతో జెండా ఎగరవేయించాలని, టోల్ గేట్ దగ్గర రైతులకు ఉచితం అని పెట్టాలన్నారు. ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. రైతు లేకపోతే సమాజం లేదని, రైతులంతా కష్టపడితే అందరూ తింటున్నారన్నారు.
ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 25మంది రైతులను సత్కరించారు. డా. స్రవంతి, పబ్బ శరణ్య, కొమటి రమేశ్ బాబు, కొన్నె దేవేందర్, బత్తిని రాజేశ్, గీతానంద్, రాగి స్వప్న, గంగాధర్, నాగేంద్ర, వంశీకృష్ణ, రాజేశ్ పాల్గొన్నారు.