రైతుల ఆందోళనకు వరుణ్ గాంధీ మద్దతు

రైతుల ఆందోళనకు వరుణ్ గాంధీ మద్దతు

న్యూఢిల్లీ: రైతులు చేస్తున్న ఆందోళనకు ఆశ్చర్యకరమైన రీతిలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మద్దతు తెలిపారు. ఆదివారం ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్‌నగర్‌లో జరుగుతున్న కిసాన్‌ మహాపంచాయత్ కు హాజరైన ప్రజల ఫొటోను ఆయన ట్వీట్‌ చేస్తూ.. రైతులతో మళ్లీ చర్చలు జరపాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కె.ఎం) ఆధ్వర్యంలో  ముజఫర్ నగర్ లోని ప్రభుత్వ కాలేజీ మైదానంలో లక్షల మంది రైతులు ప్రదర్శనకు ఇవాళ ముజఫర్‌నగర్‌కు హాజరయ్యారని.. రైతులే దేశానికి దేహం, రక్తమని ఆయన ట్వీట్‌ ల్ రాసుకున్నారు. రైతుల ఆవేదన, వారి దృక్పథం అర్థమౌతోందని, గౌరవ ప్రదమైన రీతిలో వారితో తిరిగి సంబంధాలు పెట్టుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఒక అంగీకారానికి వచ్చి  వారితో పనిచేయాల్సి ఉందని వరుణ్‌ గాంధీ పేర్కొన్నారు.