గోదావరి నది మధ్యలో చిక్కుకున్న జగిత్యాల రైతులు

గోదావరి నది మధ్యలో చిక్కుకున్న జగిత్యాల రైతులు

జగిత్యాల జిల్లా కౌలు రైతులు గోదావరి నది మధ్యలో చిక్కుకుపోయారు. కురు అనే దీవిలో తొమ్మిది మంది కౌలు రైతులు చిక్కుకున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం చిట్యాల, జగిత్యాల జిల్లా బోర్నపల్లి గ్రామాల దగ్గర గోదావరి నది రెండు పాయలుగా చీలుతుంది. మధ్యలో ఉండే వ్యవసాయ భూమిని కౌలు రౌతులు అక్కడే ఉండే వ్యవసాయం చేస్తుంటారు. అయితే మూడు రోజులుగా భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో కురు ప్రాంతాంలో ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. గోదావరి ఉధృతి పెరుగుతుండటంతో తమను కాపాడాలని కోరుతున్నారు.