పెద్దపల్లిలో విద్యుత్ సిబ్బందిని గదిలో నిర్బంధించిన రైతులు

పెద్దపల్లిలో విద్యుత్ సిబ్బందిని గదిలో నిర్బంధించిన రైతులు

పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ఖానాపూర్ రైతులు ఆందోళన చేశారు. అన్నారం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వల్ల ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్  స్తంభాలు నేలమట్టం అయినా..వాటికి మరమ్మతులు చేయడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నలుగురు విద్యుత్ సిబ్బందిని గదిలో వేసి నిర్బంధించారు రైతులు. 

విద్యుత్ సరఫరా చేయకుంటే కుటుంబ సభ్యులతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యలకు పాల్పడుతామని మందు డబ్బాలు చూపిస్తూ రైతులు నినాదాలు చేశారు. వారం రోజుల్లో కాలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలకు మరమ్మతు చేస్తామని ఏఈ హామీ ఇవ్వడంతో  రైతులు ధర్నాను విరమించారు.