సంగం డెయిరీ ఎదుట రైతుల ఆందోళన

సంగం డెయిరీ ఎదుట రైతుల ఆందోళన
  • మిర్యాలగూడలోని వెంకటేశ్వర డెయిరీని కొనుగోలు చేసిన సంగం డెయిరీ
  • పాడి రైతులకు కోట్లాది రూపాయల బకాయి పడ్డ వెంకటేశ్వర డెయిరీ
  • బకాయిలు చెల్లించాలని ధర్నాకు దిగిన రైతులు

మిర్యాలగూడ, వెలుగు : పాత డెయిరీకి సంబంధించిన బకాయిలు చెల్లించకుండా, అదే స్థానంలో కొత్త డెయిరీని ఎలా ప్రారంభిస్తారంటూ పలువురు రైతులు ఆందోళనకు దిగారు. వెంకటేశ్వర పాల డెయిరీ యజమానులు, రైతులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని శ్రీనివాస్‌‌‌‌నగర్‌‌‌‌లో వెంకటేశ్వర పాల డెయిరీకి గతంలో పలువురు రైతులు పాలు పోసేవారు. ఏడాదిన్నర కింద పాల డెయిరీ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తడంతో అమ్మేందుకు ప్రపోజల్స్‌‌‌‌ పెట్టారు. దీంతో ఈటీపీ ప్లాంట్‌‌‌‌, వెంకటేశ్వర డెయిరినీని రూ. 28 కోట్లకు కొనేందుకు సంగం పాల డెయిరీ ముందుకు వచ్చి అగ్రిమెంట్‌‌‌‌ చేసుకుంది. తర్వాత కొన్ని రోజులకే ఆ అగ్రిమెంట్‌‌‌‌ క్యాన్సిల్‌‌‌‌ చేసుకొని డెయిరీని మాత్రమే రూ. 22  కోట్లకు కొంటామని మరోసారి అగ్రిమెంట్‌‌‌‌ చేసుకుంది. తర్వాత బ్యాంక్‌‌‌‌ వేలం టైం దగ్గర పడే వరకు రిజిస్ట్రేషన్‌‌‌‌ చేసుకోకుండా ఆలస్యం చేశారు. ఈ లోగా డెయిరీని బ్యాంక్‌‌‌‌ ఆఫీసర్లు వేలం వేయడంతో సంగం డెయిరీ సింగిల్‌‌‌‌ బిడ్‌‌‌‌ వేసి రూ. 11 కోట్లకు వెంకటేశ్వర పాల డైయిరీని దక్కించుకుంది.

 బుధవారం డెయిరీని ఓపెనే చేసేందుకు ప్రయత్నించగా విషయం తెలుసుకున్న సుమారు 100 మంది రైతులు అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. వెంకటేశ్వర పాల డెయిరీ పరిధిలోని రైతులకు సుమారు రూ. 5 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని, సంగం పాల డెయిరీ కొద్ది మందికే సెటిల్‌‌‌‌ చేసి చేతులు దులుపుకుందని ఆరోపించారు. మిల్క్‌‌‌‌ ట్యాంకర్లు, పౌడర్, ఇతర ఉద్యోగులకు, పాడి రైతులకు కలిసి కోట్లాది రూపాయలు రావాల్సి ఉందన్నారు. తమకు న్యాయం జరిగే వరకు సంగం పాల డెయిరీని ప్రారంభించేందుకు ఒప్పుకోబోమని పట్టుపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న రూరల్‌‌‌‌ పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైతులు ఓ వైపు ఆందోళన చేస్తుండగానే మరో వైపు సంగం డెయిరీని ఓపెన చేశారు.