హైవే ఎక్కిన అన్నదాతలు

హైవే ఎక్కిన అన్నదాతలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రోడ్డెక్కారు సూర్యాపేట జిల్లా అన్నదాతలు. కుడకుడ దగ్గర దంతాలపల్లి హైవేపై బైటాయించారు. ధాన్యం కుప్పలు పోసి ఐదు రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోళ్ళు చేపట్టడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం ఐకేపీ స్థానంలో DCMS  ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు అధికారులు. కానీ ఎలాంటి ముందుస్తు సమాచారం లేకుండానే డీసీఎంఎస్ కేంద్రాన్ని క్లోజ్ చేశారు . దీంతో ధాన్యం అమ్ముకునేందుకు వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నామని ఆగ్రహం చెందిన రైతులు ఆందోళనకు దిగారు. తక్షణమే ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభించాలని డిమాండ్ చేశారు రైతులు.