ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను మళ్లీ తెరపైకి తెచ్చారు జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా. ఆ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కేవలం ద్వేషం ఆధారంగా కశ్మీర్ ఫైల్స్ను తెరకెక్కించారని ఆరోపించారు. ఒక ముస్లిం హిందువును చంపి, అతని రక్తాన్ని అన్నంలో పోసి, అతని భార్యను తినమని కోరే అవకాశం ఉందా? కానీ సినిమాలో అటువంటివి చూపించారు. పిల్లల్లో కూడా ఈ సినిమా విష బీజాలనే నింపుతోందని మండిపడ్డారు. దేశంలో ముస్లింలపై ద్వేషపూరిత వాతావరణం నెలకొందని, కాశ్మీర్లో ముస్లిం యువకుల ఆగ్రహానికి ఇదే కారణమని అన్నారు. కశ్మీర్ పండిట్ హత్యకంటే ప్రధాని మోదీకి కశ్మీర్ ఫైల్స్ సినిమాయే ప్రధానమని ఆరోపించారు. కాగా జమ్మూ కశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో ఇటీవల కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ హత్యకు గురయ్యారు.
మరిన్ని వార్తల కోసం
17 రోజుల తర్వాత ప్రగతిభన్ కు కేసీఆర్
ధాన్యం కొనుగోళ్లలో ఎందుకు ఆలస్యం