దిశ కేసు.. మహబూబ్ నగర్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు

దిశ కేసు.. మహబూబ్ నగర్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు

సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు  చేయాలంటూ ప్రభుత్వం తరపున లా సెక్రటరీ సంతోష్ రెడ్డి  లేఖ రాయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు.  దీంతో మహబూబ్ నగర్ కోర్టుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో మహబూబ్ నగర్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కానుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు తర్వాత నిందితులను విచారించి త్వరగా శిక్షపడేలా చేయనున్నారు.