
న్యూఢిల్లీ: మరో భారతీయుడు అమెరికా కంపెనీ బాస్అయ్యారు. ఇండియన్–అమెరికన్ రాజ్ సుబ్రమణియంను తమ సీఈఓగా నియమించుకున్నట్టు అమెరికా లాజిస్టిక్ కంపెనీ ఫెడెక్స్ కార్పొరేషన్ ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న ఈయన జూన్ నుంచి కొత్త పోస్టులోకి వస్తారు. ఇప్పుడున్న చైర్మన్, సీఈఓ ఫ్రెడరిక్ స్మిత్ ఇక నుంచి ఎగ్జిక్యూటివ్చైర్మన్గా పనిచేస్తారు. కేరళలోని త్రివేండ్రానికి చెందిన రాజ్ 1991లో ఫెడెక్స్లో చేరారు. 2020 కంపెనీ బోర్డులో చోటు సంపాదించారు. వ్యాపార వ్యూహాలు రచించడం, వాటిని సమర్థంగా అమలు చేయడంలో ఆయనకు చాలా అనుభవం ఉందని కంపెనీ ప్రకటించింది. ప్రపంచంలోని అతిగొప్ప కంపెనీల్లో ఒకటైన ఫెడెక్స్ సీఈఓగా అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని రాజ్ అన్నారు. ఫెడెక్స్1971లో ఏర్పాటయింది. ప్రపంచవ్యాప్తంగా లాజిస్టిక్స్ సర్వీసులు అందించే ఈ కంపెనీలో ఆరు లక్షల మంది పనిచేస్తున్నారు.