MBT నేత వేధింపులతో మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం

MBT నేత వేధింపులతో మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌లోని డబీర్‌పురాకు చెందిన ఎంబీటీ నేత సయ్యద్ సలీం (66) వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ న్యూస్ చానల్‌లో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టు ఆత్మహత్యకు యత్నించారు. సెల్ఫీ వీడియో తీసుకుని నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె ఒవైసీ  ఆస్పత్రిలో  ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. 

గుల్షన్-ఎ-ఇక్బాల్ కాలనీకి చెందిన 37 ఏళ్ల సయ్యదా నాహీదా ఖాద్రీ  ఓ న్యూస్ చానల్‌లో పనిచేస్తున్నారు. అయితే ఎంబీటీ నేత సలీం కొద్ది రోజులుగా ఆమెను వేధిస్తున్నారు. అసభ్యకర వీడియోలు, ఫొటోలు  సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఆయన వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఖాద్రీ.. తనకు ఆత్మహత్య తప్ప మరో దారి కనిపించడం లేదని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ.. శనివారం రాత్రి ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. ఖాద్రీ కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సలీంను అరెస్ట్ చేశారు.