హైదరాబాద్, వెలుగు: ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడాన్ని సవాల్ చేసిన వ్యాజ్యంపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ జీవో 33పై సమగ్ర వివరాలు అందజేయాలని సూచించింది. గత ఫిబ్రవరిలో జారీ చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్ నియామకాలు కూడా తాము ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటాయని షరతు విధించింది. ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ 2022లో జారీ చేసిన జీవో 33ను సవాల్ చేస్తూ పి. శ్యాంసుందర్ రెడ్డితో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జడ్జి జస్టిస్ అభినందకుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారణ చేపట్టింది. వాదనల తర్వాత ధర్మాసనం ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ, న్యాయశాఖ, గిరిజన సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు టీఎస్పీస్సీకి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 28వ తేదీకి వాయిదా వేసింది.
ఎస్టీ రిజర్వేషన్ల పెంపు జీవోపై..కౌంటర్ దాఖలు చేయండి : హైకోర్టు
- హైదరాబాద్
- May 5, 2024
లేటెస్ట్
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే
- RCB vs CSK: మహా సమరం.. మిస్ అవ్వకండి: కీలక మ్యాచ్లో టాస్ ఓడిన బెంగుళూరు
- స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!