
66వ సౌత్ ఇండియా ఫిల్మ్ఫేర్ అవార్డుల కార్యక్రమం శనివారం చెన్నైలో ఘనంగా జరిగింది. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రు ఇండోర్ స్టేడియంలో నిన్న సాయంత్రం నిర్వహించిన ఈ వేడుకలకు టాలీవుడ్, కోలీవుడ్, కన్నడ, మలయాళ పరిశ్రమలకు చెందిన నటీనటులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డ్ రామ్ చరణ్ (రంగస్థలం) దక్కించుకోగా, ఉత్తమ నటి అవార్డు కీర్తి సురేష్ (మహానటి) గెలుచుకుంది.
ఫిల్మ్ ఫేర్ (2019) విజేతలు:
ఉత్తమ చిత్రం- మహానటి
ఉత్తమ దర్శకుడు – నాగ్ అశ్విన్ (మహానటి)
ఉత్తమ నటుడు – రామ్ చరణ్ (రంగస్థలం)
ఉత్తమ నటి – కీర్తి సురేష్ (మహానటి)
ఉత్తమ నటుడు (విమర్శకులు)- దుల్కర్ సల్మాన్ (మహానటి)
ఉత్తమ నటి (విమర్శకులు) – రష్మిక మండన్న (గీత గోవిందం)
ఉత్తమ సహాయ నటుడు – జగపతి బాబు (అరవింద సమేత వీర రాఘవ)
ఉత్తమ సహాయక నటి – అనసూయ భరద్వాజ్ (రంగస్థలం)
ఉత్తమ సంగీత దర్శకుడు – దేవి శ్రీ ప్రసాద్ – (రంగస్థలం)
ఉత్తమ సాహిత్యం – చంద్రబోస్ – యెంత సక్కగున్నవే (రంగస్థలం)
ఉత్తమ గాయకుడు – సిడ్ శ్రీరామ్ – ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే (గీతా గోవిందం)
ఉత్తమ గాయకురాలు – శ్రేయా ఘోషల్ – మందారా మందారా (భాగమతి)