రూపాయికే అంత్యక్రియలు: కరీంనగర్ మేయర్ నిర్ణయం

రూపాయికే అంత్యక్రియలు: కరీంనగర్  మేయర్ నిర్ణయం

కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్పోరేషన్ పరిధిలో ఎవరైనా చనిపోతే.. కేవలం ఒక్క రూపాయికే అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు మేయర్ రవీందర్ సింగ్. “అంతిమ యాత్ర-ఆఖరి సఫర్” పేరుతో జూన్ 15 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. కార్పొరేషన్ తరపున అంతిమ యాత్ర కోసం వాహనంతోపాటు దహన సంస్కారాలకు అవసరమైన సామాగ్రి, 50 మందికి భోజనాలు ఏర్పాటు చేయనున్నట్టు  చెప్పారు. అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు మేయర్ రవీందర్ సింగ్. దేశంలోనే మొదటిసారిగా ఇలాంటి పథకాన్ని చేపడుతున్నామన్నారు.