- అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా
- మళ్లీ ఓటర్ల జాబితా సవరణకు ఈసీ షెడ్యూల్
- వచ్చే నెల 23 నుంచి బీఎల్ఓల ఇంటింటి పరిశీలన
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాదే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి ఓటర్ల జాబితా సవరణను చేపట్టింది. ఈ మేరకు రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్ను ఈసీ ప్రకటించింది. వచ్చే అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండినోళ్లు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఎన్నికల కమిషన్ అధికార వెబ్సైట్ www.nvsp.in ద్వారా అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. జూన్ 23 వరకు బీఎల్ఓల ద్వారా ఇంటింటి పరిశీలన చేపట్టనున్నట్టు తెలిపింది. జూన్ 24 నుంచి జులై 27 వరకు పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్, డబుల్ఎంట్రీల తొలగింపు తదితర ప్రక్రియ పూర్తి చేయనుంది.
అనంతరం ఆగస్టు 2న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించనుంది. దీనిపై ఆగస్టు 31 వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం కల్పించింది. ఏమైనా సమస్యలు, లోపాలు తలెత్తితే వాటి పరిష్కారానికి సెప్టెంబర్ 2 వరకు గడువిచ్చింది. ఈ ప్రక్రియను పూర్తి చేసి అక్టోబర్ 4న రాష్ట్ర ఓటర్ల తుది జాబితా ప్రకటించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలను ఈసీ ఇప్పటికే ప్రారంభించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈసీఐఎల్ ఇంజినీర్ల సమక్షంలో ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.
డీఈఓలు, ఎఫ్ఎల్సీ విధానం, సింబల్ నమోదు విధానం, డిప్యూటీ డీఈఓల బాధ్యతలు, వీవీ ప్యాట్స్ వినియోగాన్ని వివరించారు. వివిధ అంశాలకు సంబంధించి ప్రతి జిల్లాలో 18 మంది నోడల్ అధికారులను నియమించాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,99,77,659 మంది ఓటర్లు ఉన్నారన్నారు.