గండిపేట, వెలుగు: రన్నింగ్లో ఉన్న స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు బుధవారం చంపాపేట్ నుంచి శంషాబాద్ వైపు పిక్నిక్కు వెళ్తున్నారు. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి పిల్లలను కిందికి దించేశాడు. దీంతో పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
