విశాఖ నగరంలో వరుస ప్రమాదాలు అక్కడి ప్రజల్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఫిషింగ్ హార్బర్లో చేపల వేట కోసం సముద్రానికి వెళ్లిన బోటు ప్రమాదానికి గురైంది. బోటులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు అంటుకొని బోటు మొత్తం తగలబడింది. ప్రమాద సమయంలో బోటులో ఐదుగురు మత్సకారులు ఉన్నారు. అప్రమత్తతో వ్యవహరించడంతో వారెవరికి ఎటువంటి అపాయం జరగలేదు. సముద్రంలో చేపల వేట తర్వాత తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది?. ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బోటులో వేటకు వెళ్లిన మత్యకారులంతా సురక్షితంగానే ఉన్నారని విశాఖ డీసీపీ సురేష్ బాబు తెలిపారు.