మణికొండలో అపార్ట్ మెంట్ ఐదో ఫ్లోర్​లో మంటలు

మణికొండలో అపార్ట్ మెంట్ ఐదో ఫ్లోర్​లో మంటలు
  •     షార్ట్ సర్క్యూట్​తో ఫ్లాట్​లో అగ్ని ప్రమాదం
  •     భయంతో బయటకు  పరుగులు తీసిన అపార్ట్​మెంట్ వాసులు
  •     మణికొండలోని కులీ కుతుబ్ షా కాలనీలో ఘటన

గండిపేట, వెలుగు : మణికొండలోని ఓ అపార్ట్ మెంట్‌‌‌‌ ఫ్లాట్​లో షార్ట్ సర్య్కూట్‌‌‌‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  మణికొండలోని కులీ కుతుబ్‌‌‌‌ షా కాలనీలో శ్రీనివాస అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌  ఐదో ఫ్లోర్​లో సివిల్ ఇంజనీర్ సురేశ్​తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. సాయంత్రం పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు సురేశ్ భార్య ఫ్లాట్​కు లాక్ వేసుకుని వెళ్లింది. కొద్దిసేపటికే ఫ్లాట్​లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అపార్ట్ మెంట్ లోని 54 ఫ్లాట్లలో ఉంటున్న వారు భయంతో బయటికి పరుగులు తీశారు. 

స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. నాగులపల్లి, మాదాపూర్ నుంచి ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో సురేశ్​ ఫ్లాట్​లోని సామగ్రి కాలిపోయింది.  ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని రంగారెడ్డి జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు.