
హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి,పాపి రెడ్డి నగర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. సూర్య ఎంటర్ ప్రైజెస్(ఆలు చిప్స్ కంపెనీ) గోదాములో జులై 16న ఉదయం తెల్లవారు జామున 3 గంటలకు మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలకు కంపెనీ పక్కన ఉన్న ఇండ్ల చుట్టూ అలుముకున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ,ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. కంపెనీలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ లో ఈ మధ్య తరచూ ఏదో చోట నిత్యం అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే పాశమైలారం సిగాచీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదానికి 44 మందిచనిపోయిన సంగతి తెలిసిందే. ఇంకా 8 మంది మృతదేహాల ఆచూకీ ఇంత వరకు జాడలేదు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.