ఢిల్లీ ఛతర్పూర్ మెట్రోస్టేషన్ దగ్గర కాల్పులు..స్కార్పియోలో వెళ్తున్న వ్యక్తికి తీవ్రగాయాలు

ఢిల్లీ ఛతర్పూర్ మెట్రోస్టేషన్ దగ్గర కాల్పులు..స్కార్పియోలో వెళ్తున్న వ్యక్తికి తీవ్రగాయాలు

ఢిల్లీలోని ఛతర్పూర్ మెట్రో స్టేషన్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. గురువారం(మే15) మధ్యాహ్నం స్కార్పియోలో వెళ్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. 

సిడిఆర్ చౌక్ పీఎస్ మెహ్రౌలి సమీపంలో కాల్పుల సంఘటన మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు.కారులో ఉన్న అయా నగర్ నివాసి బాధితుడికి బుల్లెట్ గాయాలు అయ్యాయి.. ఆస్పత్రికి తరలించామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

VIDEO | Delhi: Man shot at multiple times near Chhatarpur Metro Station, rushed to hospital. The incident occurred around 1 pm. More details awaited.

(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/O0n9j87VOd

— Press Trust of India (@PTI_News) May 15, 2025