ఏపీలో కరోనా కలకలం.. అనంతపురం జిల్లాలో తొలి కేసు నమోదు..

ఏపీలో కరోనా కలకలం.. అనంతపురం జిల్లాలో తొలి కేసు నమోదు..

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.. రోజరోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4 వేల 866 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం. గత 24 గంటల్లో ఒక వెయ్యి 238 కొత్త కేసులు నమోదైనట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. ఇదిలా ఉండగా ఏపీలో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో కరోనా కేసు నమోదయ్యింది. జిల్లాలో ఇది తొలి కేసు. అనంతపురంలోని  పాతూరుకు చెందిన ఓ మహిళకు జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరగా..  అనుమానంతో కరోనా టెస్ట్ నిర్వహించారు డాక్టర్లు. డాక్టర్లు అనుమానించినట్లే ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.

కరోనా పాజిటివ్ వచ్చిన సదరు మహిళకు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని సూచించగా.. అందుకు ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది.హోమ్ ఐసోలేషన్ లోనే ఉండి చికిత్స తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది.  జిల్లాలో తొలి కేసు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు అధికారులు.

►ALSO READ | నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం... నలుగురు మృతి

తెలంగాణాలో కూడా కరోనా వేగంగా వ్యాపిస్తోంది.. ఇప్పటిదాకా తెలంగాణాలో నలుగురు కరోనా బారిన పడినట్లు సమాచారం. కరోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి చర్యలు చేపట్టారు వైద్యశాఖ అధికారులు. అయితే.. ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్లు అంత ప్రమాదకరం కాదని.. సకాలంలో చికిత్స తీసుకుంటే నయం అవుతుందని అంటున్నారు వైద్యులు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. 

ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో ఒక వెయ్యి 238 కొత్త కేసులు నమోదవ్వగా... ఏడుగురు మరణించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల 866కు చేరినట్లు వెల్లడించారు అధికారులు.