వాషింగ్టన్: అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్ర గవర్నర్గా తొలి ఇండియన్ అమెరికన్ అరుణా మిల్లర్ ఎన్నికయ్యారు. గురువారం మేరీల్యాండ్ 10వ లెఫ్టినెంట్ గవర్నర్గా ఆమె భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేసి, చరిత్ర సృష్టించారు. అన్నాపోలీస్లోని స్టేట్ హౌస్ సెనేట్ చాంబర్లో ఆమె తన ఫ్యామిలీ సమక్షంలో ప్రమాణం చేశారు. 58 ఏండ్ల అరుణా మిల్లర్ 2010 నుంచి 2018 వరకు మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్గా రెండు సార్లు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన అరుణ ఏడేండ్ల వయసులో ఆమె కుటుంబం అమెరికాకు వలస వచ్చింది. ఆమె తండ్రి ఐబీఎంలో ఇంజినీర్గా పనిచేసేవారు.