ఢిల్లీ నర్సరీ అడ్మిషన్ 2024 : త్వరలోనే జాబితా రిలీజ్

ఢిల్లీ నర్సరీ అడ్మిషన్ 2024 : త్వరలోనే జాబితా రిలీజ్

డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (DOE) ఢిల్లీ నర్సరీ, కిండర్ గార్టెన్ క్లాస్ 1 లో అడ్మిషన్ల కోసం దరఖాస్తుల మొదటి జాబితాను విడుదల చేయబోతోంది. త్వరలోనే ఢిల్లీ నర్సరీలో అడ్మిషన్ కోసం మొదటి జాబితా అప్‌లోడ్ చేయబడుతుందని భావిస్తున్నారు. జనవరి 12, 2024 విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. మెరిట్ జాబితా ముగిసిన తర్వాత, అధికారిక వెబ్‌సైట్ edudel.nic.in నుండి తల్లిదండ్రులు మొదటి జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. పాయింట్ల విధానంలో కేటాయించిన మార్కులతో పాటు మెరిట్ జాబితాను విడుదల చేస్తారు.  

ఢిల్లీలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలకు ఢిల్లీ నర్సరీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 23న ప్రారంభించమైంది. ఇటీవలే అభ్యర్థులకు తుది గ్రేడ్‌లను విడుదల చేయడం ప్రారంభించింది.
ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తుల (EWS) కోసం నియమించబడిన ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్ల కోసం కేంద్రీకృత ఆన్‌లైన్ అడ్మిషన్ ప్రక్రియను విద్యా శాఖ (DoE) పర్యవేక్షిస్తోంది. DoE షేర్ చేసిన సమాచారం ప్రకారం, అభ్యర్థులు ఒకే విధమైన స్కోర్‌లను కలిగి ఉంటే, ఎంపికను ఖరారు చేయడానికి పాఠశాలలు డ్రాను నిర్వహిస్తాయి. అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి చివరి తేదీ మార్చి 8గా యాజమాన్యం నిర్ణయించింది.

వయో పరిమితి

  • నర్సరీ ప్రవేశానికి పిల్లల వయస్సు 3 - 4 సంవత్సరాల మధ్య ఉండాలి
  •  KG (కిండర్ గార్టెన్): పిల్లల వయస్సు పరిమితి 4 నుండి 5 సంవత్సరాల లోపు ఉండాలి.
  • క్లాస్ 1: వయస్సు 5 - 6 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఈ అడ్మిషన్ ప్రాసెస్ ను కంప్లీట్ చేసేందుకు మార్చి 8 వరకు గడువు ఉంది.