- పాల్గొన్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు
వెలుగు, నెట్వర్క్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ప్రచారం మంగళవారం ముగిసింది. ప్రచారానికి చివరి రోజు కావడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులతో ప్రచారం హోరెత్తింది. ములుగు జిల్లా ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఎమ్మెల్యే నాగరాజు, గీసుగొండ మండలంలో పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి, రాయపర్తి మండలంలో ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, తొర్రూరు మండలంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ఝాన్సీరెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. కాగా, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల తరఫున మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రచారం చేయగా, ఏటూరునాగారంలో ఆ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు, లింగాల ఘన్పూర్ మండలంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రచారం నిర్వహించారు. పర్వతగిరి, వర్ధన్నపేట మండలాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థుల ప్రచారంలో వరంగల్ కోఆపరేటీవ్బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ఆధ్వర్యంలో ప్రచారం చేశారు.

