కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండాలో ఎన్నికలను బహిష్కరించిన చిన్న గోకుల్ తాండవాసులు
నిజామాబాద్ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 50.73 శాతం పోలింగ్ నమోదు
జోగులాంబ గద్వాల జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 54.78 శాతం పోలింగ్ నమోదు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు పోలింగ్ పర్సంటేజ్
వరంగల్ జిల్లాలో 61.21 శాతం
మహబూబాబాద్ జిల్లాలో 61.87 శాతం
హనుమకొండ జిల్లాలో 48.95 శాతం
ములుగు జిల్లాలో 43.94 శాతం
జనగామ జిల్లాలో 47.92 శాతం
భూపాలపల్లి జిల్లాలో 57.68%
పెద్దపల్లి జిల్లా మంథని మండలం తోట గోపాయ్యపల్లి గ్రామంలో ఉద్రిక్తత. గ్రామానికి చెందిన పర్వతాలు యాదవ్ పై మంథని సీఐ రాజు దాడి చేశారంటూ ఆందోళనకు దిగిన గ్రామస్తులు. పర్వతాలు యాదవ్ ఇంట్లోకి వచ్చిన సీఐ.. అతన్ని లాఠీతో కొడుతూ రోడ్డుపైకి ఈడ్చుకొచ్చాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.. సీఐ రాజును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడత జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో.. ఉదయం 11 గంటల వరకు 61.87 శాతం పోలింగ్ నమోదు. ఉత్సాహంగా ఓటు వేస్తున్న గ్రామస్తులు.
పెద్దపల్లి జిల్లాలో 5 మండలాల్లో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 52.42 శాతం పోలింగ్ నమోదైంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉదయం 11గంటల వరకు 58.68 పోలింగ్ శాతం నమోదు
ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 11గంటల వరకు 40.37 పోలింగ్ శాతం నమోదు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జలిగామలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా ఓ అభ్యర్థి భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ములుగు జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 43.94 శాతం పోలింగ్ నమోదు
వనపర్తి జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 51.8 శాతం పోలింగ్ నమోదు
కరీంనగర్ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 46.39 శాతం పోలింగ్ నమోదు
మండలాల వారిగా: చొప్పదండి మండలంలో 53.98 శాతం
గంగాధర మండలంలో 45.16
కరీంనగర్ రూరల్ మండలంలో 49.64 శాతం
కొత్తపల్లి మండలంలో 40. 83 శాతం పోలింగ్ నమోదు
నారాయణపేట జిల్లాలో ఉదయం 11 గంటల సమయానికి సగటున 57.71 శాతం పోలింగ్ నమోదు
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని 23 గ్రామ పంచాయితీల పరిధిలో ఉదయం 11 గంటల వరకు 40.83 శాతం పోలింగ్
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండంలోని 15 గ్రామ పంచాయితీల పరిధిలో ఉదయం 11 గంటల వరకు 54.04 శాతం పోలింగ్ నమోదు. ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్న గ్రామ ఓటర్లు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పోలీస్ వాహనం డోర్ తాకడంతో 5వ వార్డు మెంబర్ అభ్యర్థి విజయలక్ష్మి చేతికి గాయం
పోలీస్ వాహనం డోర్ అకస్మాత్తుగా తెరవడంతో ద్విచక్రవాహనంపై వస్తూ కారు డోర్ను ఢీకొట్టడంతో కింద పడిపోయిన విజయలక్ష్మి
ఎన్నికల కేంద్రం వైపు వెళ్తుండగా జరిగిన ఘటన
పోలీస్ వాహనంలో మెట్ పల్లి ఆసుపత్రికి తరలించిన పోలీసులు
చెయ్యి విరగడంతో చికిత్స అందిస్తున్న వైద్యులు
రుద్రంగి మండల కేంద్రంలోని పోలింగ్ బూత్ 5 లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ పంచుతు పట్టుబడిన వార్డు అభ్యర్థి రాజు. ఓటర్లకు డబ్బులు పంచుతుండగా వార్డు అభ్యర్థి రాజును పట్టుకున్న స్పెషల్ పార్టీ పోలీసులు. అతని నుంచి 40 వేల రూపాయలు స్వాధీనం. రాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు.
నల్గొండ జిల్లా ఉరుమడ్లలో ఉద్రిక్తత
శాసనమండలి చైర్మన్ గుత్తా ఇంటి ఎదుట మాజీ ఎమ్మెల్యే కంచర్ల ప్రచారంతో కొద్దిసేపు టెన్షన్
కంచర్ల భూపాల్ రెడ్డిని అడ్డుకుని.. అక్కడి నుంచి తరలించిన పోలీసులు
గుత్తా, కంచర్ల ఇద్దరిదీ ఇదే గ్రామం కావటంతో.. పంచాయితీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు
పోలింగ్ బూత్ దగ్గర పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల ప్రచారం
రెండు పార్టీల నేతలను పోలింగ్ స్టేషన్ల నుంచి దూరంగా పంపించిన పోలీసులు
నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 19.80 శాతం పోలింగ్ నమోదు
జోగులాంబ గద్వాల జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 22.26 శాతం పోలింగ్ నమోదు
మహబూబ్ నగర్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 22.55 శాతం పోలింగ్ నమోదు
నాగర్ కర్నూల్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 19.85 శాతం పోలింగ్ నమోదు.
నారాయణపేట జిల్లాలో ఉదయం 9 గంటల సమయానికి 21.13 శాతం పోలింగ్ నమోదు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఉదయం 9 గంటల వరకు 13.68 శాతం పోలింగ్
కొత్తపల్లి మండలంలో 17.55 శాతం పోలింగ్ చొప్పదండి మండలంలో 20.57 శాతం పోలింగ్
కరీంనగర్ రూరల్ మండలంలో 17.76 శాతం పోలింగ్
సిద్దిపేట జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 24.03 శాతం పోలింగ్ నమోదు
మెదక్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 20.52 శాతం పోలింగ్ నమోదు
నిర్మల్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 20.39 శాతం పోలింగ్ నమోదు
ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 11 శాతం పోలింగ్ నమోదు
కరీంనగర్ జిల్లాలో ఉదయం 9 గంటల సమయానికి 15.87శాతం పోలింగ్ నమోదు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉదయం 9 గంటల వరకు నమోదైన ఓట్ల వివరాలు
వేములవాడ నియోజకవర్గం పరిధిలో 9 గంటల వరకు 17.46 శాతం పోలింగ్
కుమ్రం బీమ్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 19.10 శాతం పోలింగ్ నమోదు
9 గంటల వరకు ఓటు వేసిన ఓటర్ల సంఖ్య 18 వేల 532
సంగారెడ్డి జిల్లాలో ఉదయం 9 గంటల వరకు..
సంగారెడ్డి మండలంలో22.54 శాతం పోలింగ్
కంది మండలంలో 26.71 శాతం పోలింగ్
కొండాపూర్ మండలంలో16.67 శాతం ఓటింగ్
సదశివాపేట మండలంలో 28.68 శాతంపోలింగ్
ఉదయం 9 గంటల వరకు
ఏటూరు నాగారంలో 10.86 శాతం పోలింగ్
గోవిందరావుపేట మండలంలో10.65 శాతం పోలింగ్
తాడ్వాయి మండలంలో20.03 శాతం ఓట్లు నమోదు
హైదరాబాద్: తెలంగాణ సర్పంచ్ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ మొదలైంది. మొత్తం 189 మండలాల్లోని 3,834 పంచాయతీల్లో పోలింగ్ మొదలైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది బుధవారమే పోలింగ్ సామగ్రి తీసుకుని తమకు కేటాయించిన గ్రామాలకు తరలివెళ్లారు.
ఫస్ట్ ఫేజ్లో 189 మండలాల్లోని 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 396 చోట్ల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 3,834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 12,960 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక మొత్తం 37,440 వార్డులకు గాను 169 చోట్ల నామినేషన్లు రాలేదు. 9,633 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 27,628 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 65,455 మంది పోటీలో ఉన్నారు. ఈ విడతలో ఒక పంచాయతీకి ఎన్నిక జరగడం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 564 మండలాల్లోని 12,723 గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1,66,48,496 మంది ఓటర్లు ఉండగా.. తొలి విడతలో 56,19,430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 27,41,070, మహిళలు 28,78,159 మంది, ఇతరులు 201 మంది ఉన్నారు. ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పట్టాదార్ పాస్బుక్, ఉపాధి హామీ జాబ్ కార్డు.. ఇలా ఎస్ఈసీ సూచించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చు.