కిడ్నీపేషెంట్​ను పొడిచిన ఫిట్స్​ పేషెంట్

కిడ్నీపేషెంట్​ను పొడిచిన ఫిట్స్​ పేషెంట్

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల గవర్నమెంట్​జనరల్​హాస్పిటల్​లో దారుణం జరిగింది. కిడ్నీ సమస్యతో ట్రీట్​మెంట్ ​పొందుతున్న ఓ పేషెంట్​ను పక్క బెడ్​పై ఉన్న మరో పేషెంట్​ కత్తితో  పొడిచాడు. బాధితుడిని వరంగల్​ఎంజీఎంకు​తరలించగా చనిపోయాడు. హాస్పిటల్​వర్గాలు, పోలీసులు ఈ ఘటనను దాచిపెట్టగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్షెట్టిపేట మండలం ఇటిక్యాలకు చెందిన చిలుక దేవయ్య(52) కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా ఈ నెల 7న కుటుంబసభ్యులు మంచిర్యాల జీజీహెచ్​లో అడ్మిట్​ చేశారు. మహారాష్ట్రలోని సిరొంచకు చెందిన ఫిట్స్ పేషెంట్ ​సుధాకర్​ఈ నెల10న హాస్పిటల్​కు రాగా, అతడికి దేవయ్య పక్క బెడ్ ను కేటాయించారు. 

11న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సైకోగా మారిన సుధాకర్ బెడ్ పై పడుకున్న దేవయ్యపై కత్తితో దాడి చేశాడు. ఛాతి, కడుపుపై పొడిచి పారిపోయాడు. దేవయ్య వెంట ఉన్న భార్య తన కొడుకు రాముకు విషయం చెప్పగా అతడు వచ్చి తండ్రికి ఓ ప్రైవేట్​ స్కానింగ్ సెంటర్ లో స్కానింగ్​ చేయిం చాడు. కండీషన్​ సీరియస్​గా ఉందని చెప్పడంతో వెంటనే హాస్పిటల్​కు వచ్చి సిబ్బందిని నిలదీశాడు. దీంతో వారు ఇక్కడ సరైన వసతులు లేవని, వరంగల్​ఎంజీఎంకు తీసుకెళ్లాలని చెప్పారన్నాడు. ఘటన తెల్లవారుజామున 3గంటలకు జరిగితే సాయంత్రం 4 గంటలకు దేవయ్యను ఎంజీఎంకు తరలించారు. రాము ఫిర్యాదు మేరకు సుధాకర్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రాజు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన సుధాకర్​మంచిర్యాలలో లేబర్ ​పనిచేస్తున్నాడని, మద్యానికి బానిసై ఫిట్స్​బారినపడి హాస్పిటల్​కు రావడంతో అడ్మిట్​ చేసుకొని ట్రీట్​మెంట్​అందించామని, ఇలా చేస్తాడని ఊహించలేదని సూపరింటెండెంట్​హరిశ్చంద్రారెడ్డి చెప్పారు. సైకోగా మారిన సుధాకర్ హాస్పిటల్​కు వచ్చేటప్పుడే వెంట కత్తి తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. సిబ్బంది గమనించకపోవడంతో ఈ దారుణం జరిగింది