- ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్రెడ్డి వెల్లడి
నందిపేట, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో అప్పు ఎగ్గొట్టేందుకు మహిళను స్నేహితులే కొట్టి చంపారు. హత్యకు సంబంధించిన వివరాలను సోమవారం ఆర్మూర్రూరల్సీఐ శ్రీధర్రెడ్డి మీడియాకు వెల్లడించారు. నందిపేటకు చెందిన ర్యాగల్ల గంగామణి (42), తన స్నేహితురాళ్లు బామని స్వరూప, అక్కా చెలెళ్లు దుబ్బాక లావణ్య, ప్రేమలకు రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షల దాకా అప్పుగా ఇచ్చింది.
కొద్ది రోజులుగా వడ్డీ చెల్లించకపోవడంతో గంగామణి నిలదీసింది. అప్పు ఎగ్గొట్టేందుకు ఆమెను చంప్లాలని ప్లాన్ చేశారు. ఈనెల 2న నిర్మల్జిల్లా బాసరకు వెళ్దామని గంగామణిని స్వరూప, లావణ్య నమ్మించి ఇద్దరూ బస్సులో వెళ్లారు. ప్రేమల, నరేశ్ దంపతులతో పాటు గంగామణి బైక్పై వెళ్లారు. అక్కడ మాంత్రికుడి వద్ద పూజలు చేయించుకుని స్వరూప, లావణ్య తిరిగి బస్సులో ఇంటికి వెళ్లారు.
బైక్ పై వెళ్లిన ముగ్గురూ తిరిగి వెళ్తూ.. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో నందిపేట తల్వేద వాగు బ్రిడ్జి వద్దకు రాగానే టాయిలెట్వస్తున్నట్టు చెప్పి ప్రేమల దంపతులు బైక్ దిగారు. గంగామణి టాయిలెట్చేస్తుండగా వెంట తీసుకెళ్లిన సుత్తెతో వెనకనుంచి ఆమె తలపై రెండు దెబ్బలు కొట్టారు. కేకలు వేస్తూ పరుగెత్తగా ప్రేమల, నరేశ్పట్టుకుని వాగులో తోసేశారు.
అనంతరం స్వరూప, లావణ్యకు హత్య సమాచారం చెప్పి దంపతులు ఇంటికి వెళ్లిపోయారు. ఈనెల 3న గంగామణి డెడ్బాడీ వాగులో కనిపించడంతో మృతురాలి కూతురు మేఘన ఫిర్యాదుతో కేసునమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను సోమవారం వెల్మల్చౌరస్తా వద్ద పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. విచారణలో మృతురాలి వదిన మగ్గిడి లావణ్య కూడా తమకు సహకరించినట్లు నిందితులు ఒప్పుకున్నట్టు చెప్పారు.
