గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ, కారు ఢీ కొనడంతో కారులో ఉన్న  ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరొకరికి గాయాలయ్యాయి.  సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతులు సంతోష్(25),మనోహర్ 22, భరద్వాజ్(20) అయ్యప్ప సొసైటీకి చెందిన వారిగా గుర్తించారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి కారణం అతి వేగమే కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.

గుట్టుగా సంగమేశ్వరం కడ్తున్నరు