
హైదరాబాద్, వెలుగు: హాష్ ఆయిల్ సప్లయర్లు ఐదుగురిని వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అత్తాపూర్కు చెందిన ముల్కల భానుప్రకాశ్(25) పంజాగుట్టలోని ఓ సంస్థలో టెలీకాలర్గా పనిచేస్తున్నాడు. జల్సాలకు బానిసై గంజాయికి అలవాటుపడ్డాడు. నర్సింహా అనే గంజాయి పెడ్లర్తో కలిసి భాను ప్రకాశ్ ఆసిఫ్నగర్ పోలీసులకు దొరికి జైలుకెళ్లాడు. బయటికి వచ్చాక బోయిన్పల్లికి చెందిన విష్ణుతో కలిసి గంజాయి నుంచి తీసిన హాష్ ఆయిల్ను సప్లయ్ చేయడం ప్రారంభించాడు. వారం కిందట విష్ణు వద్ద హాష్ ఆయిల్ కొన్నాడు. మెహిదీపట్నంలో అమ్మేందుకు ప్లాన్ చేశాడు. సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు భానుప్రకాశ్పై నిఘా పెట్టి శనివారం అరెస్ట్ చేశారు. 450 ఎంఎల్ హాష్ ఆయిల్ సీసాలు, బైక్ను సీజ్ చేశారు.
నిజాంపేటలో మరో ముగ్గురు
మూసాపేట: హాష్ ఆయిల్ అమ్ముతున్న ముగ్గురిని బాలానగర్ ఎస్వోటీ, బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపిన ప్రకారం.. సూరారంలో ఉండే బుద్రాజ్ యుటేశ్వర్మ, మామిడి వెంకట హరికృష్ణ, గాంధీనగర్లో ఉండే సయ్యద్ ఇమ్రాన్ ప్రైవేటు జాబర్స్. జల్సాలకు బానిసై ఈజీమనీ సంపాదనకు హాష్ ఆయిల్ అమ్మేందుకు ప్లాన్ చేశారు. ఏపీలోని పాడేరు, వైజాగ్ నుంచి తెప్పించి సిటీలోని వివిధప్రాంతాల్లో అమ్మడం ప్రారంభించారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు బాచుపల్లిలోని నిజాంపేట క్రాస్ రోడ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న యుటేశ్, హరికృష్ణ, ఇమ్రాన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి 230 హాష్ ఆయిల్ సీసాలు, ఒక కారు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బోరబండ రాజీవ్ గాంధీనగర్లో ఉండే నరమ్ నాథ్ ప్రవీణ్ కుమార్ సనత్నగర్లోని బల్దియా గ్రౌండ్లో హాష్ ఆయిల్ అమ్ముతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.70 సీసాలను స్వాధీనం చేసుకున్నారు.