వీధి కుక్కల దాడిలో ఐదుగురికి గాయాలు

వీధి కుక్కల దాడిలో ఐదుగురికి గాయాలు

మల్కాజిగిరి, వెలుగు: వీధి కుక్కల దాడిలో ఐదుగురు గాయపడ్డ ఘటన మల్కాజిగిరి పరిధిలో జరిగింది. ఈస్ట్ మల్కాజిగిరిలోని శ్రీకృష్ణనగర్ కాలనీలో ఉండే సాయిబాబా, సంయుక్త దంపతుల కుమార్తె ఇషిత(3) శనివారం ఉదయం 8 గంటలకు ఇంటి ముందు ఆడుకుంటోంది. వీధి కుక్కల గుంపు చిన్నారిపై దాడి చేసి గాయపర్చాయి. బాలిక తల్లిదండ్రులు వెంటనే దగ్గరలోని హాస్పిటల్​కు తరలించారు.

సాయంత్రం 5.30 గంటల సమయంలో మల్కాజిగిరిలోని వినాయక్​ నగర్ డివిజన్ కాకతీయ నగర్ రైల్వే గేట్ వద్ద నిలబడి ఉన్న వృద్ధురాలు సరోజ(60) వెంటపడ్డ వీధి కుక్కలు ఆమెపై దాడి చేసి గాయపర్చాయి. స్థానికులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదే ఏరియాలోని మరో ముగ్గురిపైనా కుక్కలు దాడి చేశాయి. మల్కాజిగిరి పరిధిలో వీధి కుక్కలను తరలించాలని పది రోజులుగా ఫిర్యాదులు ఇస్తున్నా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.