
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు అరుదైన అవకాశం లభించింది. అదేంటో కాదు అతను అంతర్జాతీయ కెప్టెన్ లకు కెప్టెన్సీ చేయనున్నాడు. ఈ సీజన్ ముంబై ఇండియన్స్ జట్టులో అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్సీ చేసిన ఐదుగురు ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా ఉన్నాడు. హిట్ మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో సూర్య కుమార్ యాదవ్ భారత టీ20 జట్టుకు కెప్టెన్సీ చేస్తున్నాడు. బుమ్రా గతంలో భారత జట్టుకు కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. ఇక న్యూజిలాండ్ వైట్ బాల్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 2025 ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడనున్నాడు.
ఈ నలుగురితో పాటు శ్రీలంక టీ20 కెప్టెన్ చరిత అసలంక ముంబైగా జట్టులోకి చేరాడు. శుక్రవారం (మే 30) గుజరాత్ టైటాన్స్ తో జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ లో ఈ ఐదుగురు బరిలోకి దిగనున్నారు. దీంతో ఐదుగురు అంతర్జాతీయ కెప్టెన్లకు పాండ్య కెప్టెన్సీ అరుదైన అవకాశం పాండ్యకు లభించింది. ఎంతో అనుభవం ఉన్నప్పటికీ ఈ నలుగురిని కాదని ముంబై ఇండియన్స్ యాజమాన్యం హార్దిక్ పాండ్యకు కెప్టెన్ గా ప్రకటించడం విశేషం. గత సీజన్ లో రోహిత్ స్థానంలో పాండ్య ముంబై సారధిగా ఎంపికయ్యాడు.ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు వరుసగా రెండోసారి సారధిగా పాండ్య బాధ్యతలు స్వీకరించానున్నాడు.
►ALSO READ | ENG vs WI: వెస్టిండీస్పై ఇంగ్లాండ్ విశ్వరూపం.. ఒకే మ్యాచ్లో రెండు ప్రపంచ రికార్డులు
ఐపీఎల్ 2025 లో భాగంగా శుక్రవారం (మే 30) ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫయర్–2కు అర్హత సాధించనుండగా.. ఓడిన జట్టు ఇంటిదారి పట్టనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో విజయం సాధించిన వెంటనే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన నాలుగో జట్టుగా నిలిచింది. ఇప్పటికే ఐపీఎల్ లో 5 టైటిల్స్ గెలిచిన ముంబై ఆరో టైటిల్ గెలవాలనే పట్టుదలతో కనిపిస్తుంది. అదే జరిగితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుకు చరిత్ర సృష్టిస్తుంది.