గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అయిజ మండలం కొత్తపల్లిలో గోడ కూలి ఒకే కుటుంబంలోని ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఐజ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పుల్లెద్దుల మోష, శాంతమ్మ దంపతులు. వారికి అయిదుగురు సంతానం. వీరంతా ఎప్పటిలాగే శనివారం రాత్రి పడుకున్నారు. అయితే జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల వారి ఇంటి గోడ కూలింది. దాంతో దంపతులతో పాటు వారి ముగ్గురు పిల్లలు చరణ్, తేజ, రాము ప్రమాదంలో చనిపోయారు. కాగా.. కూతురు స్నేహ, కొడుకు చిన్నాకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వారిని చికిత్స కోసం హాస్పిటల్‎కు తరలించారు. మోష కుటుంబం భువనగిరిలో ఇటుక బట్టీలలో పనిచేసేవాళ్లని గ్రామస్తులు చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో భువనగిరికి వెళ్లాల్సి ఉందని.. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని స్థానికులు తెలిపారు. 

For More News..

రన్నింగ్ ట్రైన్‎లో ప్యాసెంజర్ మీద దొంగల గ్యాంగ్‎రేప్