
హైదరాబాద్, వెలుగు: ఈ–-కామర్స్ మార్కెట్ప్లేస్ ఫ్లిప్కార్ట్, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి, మీసేవ ప్రతినిధులకు ఈ–-కామర్స్ ద్వారా స్థానిక వ్యాపారాలకు మార్కెట్ అవకాశాలను సులభతరం చేయడానికి అవసరమైన నైపుణ్యాలను సమకూర్చడం లక్ష్యంగా వర్క్షాప్ను నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం పరిశ్రమలు, వాణిజ్య విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, తెలంగాణ ప్రభుత్వ కమిషనర్, మీసేవ (ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ) రవికిరణ్ తిరుమల , ఐఎఫ్ఎస్ ఫ్లిప్కార్ట్ సీనియర్ మేనేజర్ డాక్టర్ దీపు థామస్ జాయ్ సమక్షంలో ఈ వర్క్షాప్ జరిగింది.
తెలంగాణ ఇంటిగ్రేటెడ్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ అయిన మీసేవ, ప్రభుత్వం నుంచి పౌరులకు రకరకాల సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. డిజిటల్ అవకాశాలు పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం మీసేవ ఆఫర్లలో ఈ–-కామర్స్ సౌకర్యాన్ని చేర్చాలని భావిస్తోంది.
ఈ వర్క్షాప్లో 800 మందికి పైగా మీసేవ ప్రతినిధులు, ఎం ఎస్ ఎం ఈ ల యజమానులు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. చిన్న వ్యాపారాలు, చేతివృత్తులవారు వ్యవస్థాపకులు ఫ్లిప్కార్ట్ మార్కెట్ ప్లేస్ను ఉపయోగించుకునేలా చేయడంపై దృష్టి సారించారు.