
న్యూఢిల్లీ : ఈ-–కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ ఆర్బీఐ నుంచి నాన్–-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) లైసెన్స్ను పొందింది. ఫ్లిప్కార్ట్ ఇకపై తన కస్టమర్లకు, అమ్మకందారులకు నేరుగా లోన్లు ఇవ్వగలుగుతుంది. దేశంలో ఎన్బీఎఫ్సీ లైసెన్స్ పొందిన మొట్టమొదటి పెద్ద ఈ-–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్టే కావడం విశేషం.
వినియోగదారులకు బయ్ నౌ, పే లేటర్ లోన్లను, ఈఎంఐ సేవలను, సెల్లర్లకు వ్యాపార విస్తరణకు అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ లోన్లను నేరుగా అందిస్తుంది. ఫ్లిప్కార్ట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట మంజూరైన ఈ లైసెన్స్తో, ఫ్లిప్కార్ట్ తన ఫిన్టెక్ యాప్ 'సూపర్మనీ' ద్వారా కూడా రుణ సేవలను అందిస్తుంది.