
న్యూఢిల్లీ: ఈ-–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ అనుబంధ సంస్థ ఫ్లిప్కార్ట్ ఇన్వెస్ట్మెంట్స్, బుధవారం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్)లో తన మొత్తం 6 శాతం వాటాను రూ. 583 కోట్ల విలువైన బ్లాక్ డీల్స్ ద్వారా అమ్మేసింది. దీంతో ఏబీఎఫ్ఆర్ఎల్ షేర్లు ఎన్ఎస్ఈలో దాదాపు 11 శాతం తగ్గి రూ. 76.94 వద్ద ట్రేడయ్యాయి.
ఫ్లిప్కార్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫ్లిప్కార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్పీఎల్) పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ. ఇది యూఎస్-ఆధారిత వాల్మార్ట్ గ్రూప్కు చెందినది.