ఏబీఎఫ్​ఆర్ఎల్​ నుంచి తప్పుకున్న ఫ్లిప్‌‌‌‌కార్ట్

ఏబీఎఫ్​ఆర్ఎల్​ నుంచి తప్పుకున్న ఫ్లిప్‌‌‌‌కార్ట్

న్యూఢిల్లీ: ఈ-–కామర్స్ సంస్థ ఫ్లిప్‌‌‌‌కార్ట్ అనుబంధ సంస్థ ఫ్లిప్‌‌‌‌కార్ట్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్, బుధవారం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్​ఆర్ఎల్​)లో తన మొత్తం 6 శాతం వాటాను రూ. 583 కోట్ల విలువైన బ్లాక్ డీల్స్ ద్వారా అమ్మేసింది. దీంతో ఏబీఎఫ్​ఆర్ఎల్ షేర్లు ఎన్​ఎస్ఈలో దాదాపు 11 శాతం తగ్గి రూ. 76.94 వద్ద ట్రేడయ్యాయి.

 ఫ్లిప్‌‌‌‌కార్ట్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్, ఫ్లిప్‌‌‌‌కార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్​పీఎల్​)  పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ. ఇది యూఎస్​-ఆధారిత వాల్‌‌‌‌మార్ట్ గ్రూప్‌‌‌‌కు చెందినది.