![సింగరేణి ఎన్నికలపై ఫోకస్ పెట్టండి : కవిత](https://static.v6velugu.com/uploads/2023/12/focus-on-singareni-elections-says-brs-mlc-kavitha_d5hw0G2nRe.jpg)
హైదరాబాద్, వెలుగు : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంస్థను గెలిపించాలని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కోరారు. బుధవారం ఆమె హైదరాబాద్లోని తన నివాసంలో కార్మిక సంఘం నాయకులతో సమావేశమై సింగరేణి ఎన్నికలపై చర్చించారు. సంస్థలో కారుణ్య నియామకాలను కేసీఆర్ప్రభుత్వమే పునరుద్ధరించిందని గుర్తుచేశారు. వేలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.
సంస్థను లాభాల బాట పట్టించడానికి, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని వివరించారు. కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ను అన్ని ఏరియాల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో టీబీజీకేఎస్అధ్యక్షుడు బి. వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ప్రెసిడెంట్కెంగర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.