మంత్రి వివేక్కు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి వివేక్కు శుభాకాంక్షల వెల్లువ

ఇబ్రహీంపట్నం/ ట్యాంక్​బండ్​, వెలుగు: ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గడ్డం వివేక్​ వెంకటస్వామికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఆయనను హైదరాబాద్​లోని సోమాజిగూడలోని నివాసంలో శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మాలల ఐక్య వేదిక నాయకులు కలిశారు. పూలమాలతో సత్కరించి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. 

మరోవైపు జై భీమ్ సేన ఫైట్ ఫర్ రైట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.బల్వంత్ రావు కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం నాయకులు హనుమాండ్ల కృష్ణ, ఈగల రాములు, అంగద్​కుమార్, డాక్టర్​ అబ్బయ్య, శ్రవణ్, రైట్స్​ ప్రతినిధులు పాల్గొన్నారు.