
హైదరాబాద్ చందానగర్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. 50 మందికి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .
జూన్ 23న ఆదివారం హాస్టల్ లో ఫుడ్ తిన్న విద్యార్థుల్లో 50 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాల చేసుకున్నారు. వారిని వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు హాస్టల్ యాజమాన్యం. 50 మందిలో ప్రస్తుతం ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.