- పెట్రోల్, డీజిల్కు ఇథనాల్ప్రత్యామ్నాయం కాదు
- సెమినార్లో శాస్ర్తవేత్తలు, మేధావుల ఆందోళన
హైదరాబాద్, వెలుగు : దేశంలో పెట్రోల్, డీజిల్వంటి ఇంధన కొరతను నివారించడానికి ప్రత్యామ్నాయంగా కేంద్రం ఇథనాల్ఉత్పత్తికి అనుమతులివ్వడం సరికాదని పలువురు మేధావులు, శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇథనాల్ ను పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా చేస్తామని, 56 రూపాయలకే లీటర్ ఇస్తామని చెప్పడం ప్రజల్ని మభ్యపెట్టడమేనని వారు అభిప్రాయపడ్డారు. నారాయణపేట జిల్లా చిత్తనూరులో ఇథనాల్పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పలు సంఘాలు, స్థానిక రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో
‘‘ఆహార పంటలతో ఇథనాల్ ఇంధనం–సాధ్యత, సుస్థిరత, శాస్ర్తీయత ’’ అనే అంశంపై శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెమినార్నిర్వహించారు. కేఏఎన్పీఎస్రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెమినార్కు ప్రొఫెసర్హరగోపాల్, డా.శర్మ, డా. కె.బాబూరావు, డా. అహ్మద్ ఖాన్, ప్రొఫెసర్విజయ్, కన్నెగంటి రవి, ప్రొఫెసర్శ్రీనివాసులు, బండారి లక్ష్మయ్య, కేజే రామారావు పాల్గొన్నారు.
ఇంధన ఖర్చు తగ్గించాలి : డా.ఈఏఎస్శర్మ
దేశంలోని సంపన్న వర్గాలు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాన్ని ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారని, కార్లు, ఇతర వాహనాలను విరివిగా వాడడం వల్ల ఇంధనం ఎక్కువ ఖర్చవుతోందని భారత మాజీ ప్రభుత్వ కార్యదర్శి డా. ఈఏఎస్శర్మ పేర్కొన్నారు. పబ్లిక్ట్రాన్స్పోర్ట్ను పటిష్టపర్చడంతోపాటు, అన్ని వర్గాలు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకుంటే ఇంధన వ్యయం చాలా వరకు తగ్గుతుందన్నారు. ఒక లీటర్ఇథనాల్ఉత్పత్తికి 2,360 లీటర్ల నీరు అవసరం అవుతుందని గుర్తు చేశారు. ప్రజా ఉద్యమాలు లేకపోతే ఇలాంటి అనర్థాలే వస్తాయన్నారు.
దేశంలో అభివృద్ధి నమూనా ప్రజల సంక్షేమానికి అనుగుణంగా ఉండాలని ప్రొఫెసర్హరగోపాల్అన్నారు. రాష్ట్రంలో ఇథనాల్ పరిశ్రమలు పెట్టడం అంటే రైతుల ప్రయోజనాలపై దెబ్బకొట్టడమేనని అన్నారు. పెట్రోల్, డీజిల్కు ఇథనాల్ ప్రత్యామ్నాయం కాదని డా. బాబూరావు అన్నారు. చిత్తనూరు ఇథనాల్ ప్లాంట్విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. ఇథనాల్ను 46 రూపాయలకే ఇవ్వడం సాధ్యం కాదని ప్రొ.విజయ్ అభిప్రాయపడ్డారు. ఇథనాల్పరిశ్రమల ఏర్పాటుకు జరుగుతున్న పోరాటానికి ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కేజే రామారావు డిమాండ్ చేశారు.