సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఊహించని రీతిలో పరాజయం పాలయింది. సౌతాఫ్రికాతో మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్లో 30 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. దాంతో రెండు మ్యాచ్ల సిరీస్లో సఫారీ జట్టు 1–0 లీడ్లో నిలిచింది. ప్రొటీస్ నిర్దేశించిన 124 రన్స్ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆదివారం బరిలోకి దిగిన ఇండియా రెండో ఇన్నింగ్స్లో 35 ఓవర్లలో 93 రన్స్కే కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్లలో హార్మర్ నాలుగు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఓటమి తర్వాత టీమిండియా సీనియర్ క్రికెటర్ చటేశ్వర్ పుజారా జట్టు ఓటమిపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
"ఇండియా పరివర్తన కారణంగా స్వదేశంలో ఓడిపోతోందని నేను అనుకోను. నేను ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాను. మీరు ఇంగ్లాండ్ లేదా ఆస్ట్రేలియాలో పరివర్తన కారణంగా ఓడిపోవడం ఆమోదయోగ్యమే. కానీ భారత జట్టులో టాలెంటెడ్, సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు చాలిందని ఉన్నారు. ఆటగాళ్ల ఫస్ట్-క్లాస్ రికార్డు అద్భుతంగా ఉంది. యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, శుభ్మాన్ గిల్ రికార్డులన్నీ చాలా బాగున్నాయి. అయినప్పటికీ మీరు స్వదేశంలో ఓడిపోతే ఏదో తప్పు జరిగిందని అర్థం.
►ALSO READ | Harbhajan Singh: సచిన్, కోహ్లీ కూడా ఆడలేరు.. స్వదేశంలో పిచ్లపై హర్భజన్ ఫైర్!
"ఇలాంటి ట్రాక్లలో ప్రత్యర్థి మా కంటే కొంచెం బలంగా ఉంటుంది. ఇండియాలో చాలా టాలెంట్ ఉంది. ఇండియా A జట్టు కూడా సౌతాఫ్రికాను ఓడించగలదు. ఈ ఓటమి పరివర్తన కారణంగా జరిగిందని చెబితే నేను ఒప్పుకోను. ఓటమి తర్వాత భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ రిషబ్ పంత్ సౌతాఫ్రికా జట్టుపై ఒత్తిడి పెంచినా దానిని కొనసాగించలేకపోయామని చెప్పాడు. టెంబా, బాష్ ల అద్భుతమైన భాగస్వామ్యం ప్రత్యర్థి జట్టును ముందుకు తీసుకెళ్లింది. తక్కువ స్కోర్ ఉన్నప్పుడు ఒత్తిడి తట్టుకొని నిలబడాల్సింది". అని పుజారా తొలి టెస్ట్ ఓటమి తర్వాత జియోస్టార్లో అన్నాడు.
