రూ.10 లక్షల అప్పుకు.. డ్రగ్స్ ఇస్తూ అలవాటు చేశారు : కోర్టులో ఏడ్చేసిన హీరో శ్రీరాం

రూ.10 లక్షల అప్పుకు.. డ్రగ్స్ ఇస్తూ అలవాటు చేశారు : కోర్టులో ఏడ్చేసిన హీరో శ్రీరాం

డ్రగ్స్ కేసులో అరెస్టైన హీరో శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ లీగల్ గా చాలా ట్రబుల్ ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి వరకు ఎందరో సెలబ్రిటీలు డ్రగ్స్ కేసులు ఎదుర్కోవడం.. మీడియాలో సంచలనం కావడం.. ఆ తర్వాత కేసులు కనుమరుగవ్వటం చూస్తూనే ఉన్నాం. కానీ శ్రీరామ్ కేసు మాత్రం చాలా కాంప్లికేట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

కోర్టు విచారణలో డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించాడు శ్రీరామ్. అయితే ఈ కేసులో బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అదే విధంగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. అయితే కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు శ్రీరామ్. తను డ్రగ్స్ కు ఎలా అలవాటు పడ్డాడో.. ఎవరివల్ల బానిసయ్యాడో కోర్టు ముందు చెప్పాడు. 

 ‘‘నాకు AIADMK మాజీ నేత ప్రసాద్ రూ. 10 లక్షలు ఇవ్వాలి. ఆ డబ్బు అడిగినప్పుడల్లా కొకైన్ ఇచ్చేవాడు. ఆ తర్వాత డబ్బుల విషయం మర్చిపోయి నేనే అతడిని డ్రగ్స్ అడుక్కునే దుస్థితికి వచ్చా. డ్రగ్స్ వినియోగించి తప్పు చేశా’’ అని కోర్టులో చెప్పారు. అంతే కాకుండా ‘‘నా కొడుకును నేను చూసుకోవాలి. దయచేసి బెయిల్ మంజూరు చేయండి’’ అంటూ ఏడ్చారు. 

►ALSO READ | NEET మాక్ టెస్టులో తక్కువ మార్కులు వచ్చాయని.. కూతుర్ని చచ్చేవరకు కొట్టిన తండ్రి !

ఒక నైట్ క్లబ్ వివాదంలో ఏఐఏడీఎంకే నేత ప్రసాద్ ను విచారిస్తున్న సందర్భంగా.. హీరో శ్రీరామ్ కు డ్రగ్స్ అమ్మినట్లు చెప్పడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా తప్పును ఒప్పుకున్నారు. ఈ డ్రగ్ కేసులో ఇంకెంత మంది సెలబ్రిటీలు, నాయకుల పేర్లు బయటికొస్తాయోననే మీమాంశ కొనసాగుతూనే ఉంది.

హీరో శ్రీరామ్ ‘ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’.. వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అచ్చం తెలుగు నటుడిలాగే ఉండే అతని హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో ఇటు తెలుగు, అటు తమిళ నాడులో శ్రీరామ్ కేసు అంశం సంచలనంగా మారింది.