శివ్వంపేట, వెలుగు: ఫారెస్ట్ ఆఫీసర్లు వేధిస్తున్నారని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రూప్ల తండాకు చెందిన గిరిజన రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చారని, ఇప్పుడేమో ఫారెస్ట్ ఆఫీసర్లు కబ్జా చేశామని కేసులు పెడుతున్నారని వాపోయారు. సాగు భూముల్లోకి తమను రావద్దని అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.
