బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుక్కు చుక్కెదురు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుక్కు చుక్కెదురు
  •      బెయిల్ పిటిషన్​ను కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ పోలీసు స్టేషన్‌‌‌‌‌‌‌‌లో 2022లో నమోదైన కేసులో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్‌‌‌‌‌‌‌‌ షకీల్‌‌‌‌‌‌‌‌ కొడుకు మహమ్మద్‌‌‌‌‌‌‌‌ రాహిల్‌‌‌‌‌‌‌‌ ఆమీర్‌‌‌‌‌‌‌‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ కేసులో ముందస్తు బెయిల్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని రాహిల్‌‌‌‌‌‌‌‌ వేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌ను కోర్టు డిస్మిస్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఈ మేరకు జస్టిస్‌‌‌‌‌‌‌‌ తుకారాంజీ మంగళవారం తుది ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు లాయర్‌‌‌‌‌‌‌‌ వాదిస్తూ.. జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌ పరిధిలో కారు కేబుల్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జి నుంచి వస్తూ ఓ కుటుంబాన్ని ఢీకొట్టిందంటూ 2022 మార్చి 17న కేసు నమోదైందన్నారు.

 ఇందులో అసనన్‌‌‌‌‌‌‌‌ మహమ్మద్‌‌‌‌‌‌‌‌ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు చార్జిషీట్‌‌‌‌‌‌‌‌ వేశారని. ఇటీవల జరి గిన రాజకీయ పరిణామాల తర్వాత రాజకీయ కక్షలతో సంఘటన జరిగిన రెండేడ్లకు పిటిషనర్ ను ఆ కేసులో ఇరికిస్తున్నారని చెప్పారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌కు ఇక్కడ స్థిరాస్తులున్నాయని, పారిపోయే అవకాశం లేదని, బెయిల్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని కోరారు. 

దీనిపై పబ్లిక్‌‌‌‌‌‌‌‌ ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌ వాదనలు వినిపిస్తూ.. రోడ్డు ప్రమాదం లో నిందితుడి పాత్ర ఉందనడానికి ఆధారాలు ఉన్నాయని అన్నారు. రాజకీ యంగా పలుకుబడి ఉన్న పిటిషనర్‌‌‌‌‌‌‌‌ ఆర్థికంగా కూడా బలవంతుడని, బెయి ల్‌‌‌‌‌‌‌‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. ఈ వాదనల తో ఏకీభవించిన హైకోర్టు బెయిల్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను కొట్టేస్తూ తీర్పు చెప్పింది.