కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధానాన్ని లూటీ చేస్తోంది : షబ్బీర్​అలీ

 కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధానాన్ని లూటీ చేస్తోంది : షబ్బీర్​అలీ

 కామారెడ్డిటౌన్, వెలుగు: కేసీఆర్​ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్​నేత షబ్బీర్​అలీ విమర్శించారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డిలో జరిగిన కేటీఆర్​మీటింగ్​పై స్పందిస్తూ హైదరాబాద్​కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డికి మంత్రి హెలిక్యాప్టర్​లో రావాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ప్రజలు ఎక్కడికక్కడ రోడ్లపై అడ్డుకుంటారనే భయంతో ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి వెళ్లిన హెలిక్యాప్టర్​లలోనే వెళ్తున్నారన్నారు.

కామారెడ్డిలో జరిగిన మీటింగ్​కార్యకర్తల మీటింగ్​కాదని, అది లీడర్ల బుజ్జగింపు మీటింగ్​ అన్నారు. బీఆర్ఎస్​లీడర్ల పంపకాల కుమ్ములాటలే కేసీఆర్​ను ఓడిస్తాయన్నారు. 2004 ఎన్నికల్లో పొత్తులో కాంగ్రెస్​అభ్యర్థి షబ్బీర్​అలీని గెలిపించాలమని కేటీఆర్​అన్నారని, ఆ పొత్తులో నన్ను ఓడించేందుకే అప్పటి టీఆర్​ఎస్​పనిచేసిందన్నారు. అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్​ఫ్యామిలీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయిందన్నారు.    దళితబంధులో రూ.3 లక్షల కమీషన్లు తీసుకున్నట్లు స్వయంగా కేసీఆర్​ఒప్పుకున్నారని గుర్తుచేశారు. డీసీసీ ప్రెసిడెంట్​కైలాస్​శ్రీనివాస్​రావు, టౌన్​ప్రెసిడెంట్​పండ్ల రాజు పాల్గొన్నారు.