కాంగ్రెస్​తోనే అభివృద్ధి సాధ్యం : చంద్రశేఖర్

కాంగ్రెస్​తోనే అభివృద్ధి సాధ్యం : చంద్రశేఖర్

మునిపల్లి (కోహీర్​), వెలుగు : గత పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న బీఆర్‌‌ఎస్​ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని, అభివృద్ధి జరగాలంటే అది కాంగ్రెస్​తోనే సాధ్యమని మాజీ మంత్రి, జహీరాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థి చంద్రశేఖర్​అన్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని  మద్రి, గురుజువాడ, రాజనెల్లి, పిచార్యాగడి, మాచిరెడ్డిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్​ నాయకులతో కలిసి పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ..  కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ  రాందాస్,  ఎంపీపీ  కుమారి,  మాధవి,  పార్టీ మండల అధ్యక్షుడు రామలింగారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ఎస్సీ వైస్ చైర్మన్ రాచయ్య,  వైస్ ఎంపీపీ షాకిర్​ అలీ పాల్గొన్నారు. 

జహీరాబాద్:  జహీరాబాద్ మండలంలోని కాశింపూర్, పస్తాపూర్ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్‌‌ఎస్​ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్​లో చేరారు. ఇందులో  రామయ్య,  రాజు, మల్లేశం, రామయ్య, చిరంజీవి,  రవి,  నరేశ్​, గోపాల్, నర్సింలు, సంజు కుమార్, బాలరాజ్, పస్తాపూర్ మేస్ట్రీ కాలనీకి చెందిన మహిళలు  ఉన్నారు.