
ఎల్లారెడ్డి, లింగంపేట, వెలుగు: ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ నేత బి. జనార్ధన్గౌడ్ శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. జనార్ధన్గౌడ్ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2008 ఉప ఎన్నికల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014లో బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్లో చేరిన జనార్ధన్గౌడ్ మళ్లీ గులాబీ గూటికి చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్, ఎంపీ బీబీపాటిల్ తదితరులు ఉన్నారు.